హైదరాబాద్ డిసెంబరు 31
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. గురువారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఆయన ప్రారంభించారు. అక్కడి లబ్ధిదారులకు, రోడ్ నెంబర్ 12 లోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత పేద ప్రజల దృష్టిలో ఉంచుకొని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించిందని చెప్పారు. గతంలో ఆడపిల్ల పెళ్లి అంటే భయాందోళనకు గురై పరిస్థితి నుంచి సంతోషంగా వివాహం జరపాలని స్థాయికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని అన్నారు. ఈ పథకాల్లో దరఖాస్తు చేసుకొని చెక్కులు అందని వారు స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదించాలని సూచించారు.