YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర ప్రజలకు ఏపి గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ఏపి గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

అమరావతి డిసెంబర్ 31 
ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ నూతన సంవత్సరం ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. 2021 నూతన సంవత్సరం ఆగమనం నేపధ్యంలో గౌరవ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తాజా పోకడలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు తమ వేడుకలను జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలని, నూతన సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవాలని గౌరవ గవర్నర్ హరిచందన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతి సంవత్సరం నూతన సంవత్సర తొలి రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్ర ప్రజలు గౌరవ గవర్నర్ ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షాలు తెలపటం అనవాయితీ కాగా, కరోనా నేపధ్యంలో ఈ విడత ఆకార్యక్రమానికి రాజ్ భవన్ దూరంగా ఉండనుందని గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.  ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసారు.

Related Posts