హైదరాబాద్, జనవరి 1,
సీఆర్ మార్క్ రాజకీయం అంటే అదే మరి. చంద్రబాబుతో కలిసి పనిచేస్తే ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది కదా. అదే వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఎప్పుడు ఎవరిని ఎలా డీల్ చేయాలో కేసీఆర్ కి బానే తెలుసు కదా. అందుకే.. బండి సంజయ్ బండి కార్ ని క్రాస్ కాకుండా బ్రేకులేసేశారు సీఎం కేసీఆర్ అంటున్నారు. చూస్తుంటే కూడా నిజమే అనిపిస్తోంది. అన్ని రకాలుగా కార్నర్ చేసేశారు. ఒక్క ఢిల్లీ పర్యటనతో తెలంగాణలో లెక్కలు అన్నీ మారిపోయాయి. సైలెంట్ గా చలికాలంలో వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్.. వైలెంట్ గా వేడిగా ఉన్న తెలంగాణ రాజకీయాల్ని చల్లబరిచేశారు. అప్పటి దాకా.. బండి సంజయ్ స్పీడ్ తెలిసిందే కదా. మొత్తం టీఆర్ఎస్ ని ప్రక్షాళన చేస్తారేమో.. అందరినీ కారులోంచి గుంజి.. బండి బండిపై ఎక్కించుకుంటారేమో అనుకున్నారు. కరీంనగర్ సైడ్ నుంచి మొదలెట్టేశారు. సెకండ్ ప్లేస్ లో ఉండే లీడర్లందరినీ లాక్కెళ్తున్నారు అని విన్నాం కదా. అలాంటి గ్రౌండ్ వర్క్ కి మొత్తం బ్రేకులేశారు సీఎం కేసీఆర్. ఏముంది చెప్పండి. సింపుల్ గా వెళ్లారు.. మోడీని కలిశారు. రైతు చట్టాలకి సపోర్టింగ్ గా మాట్లాడారు. ఇటు టీఆర్ఎస్ లీడర్లేమో.. ప్రెస్ మీట్లకి రాకుండా సైడై పోయారు. వాళ్లు ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితి. సీఎం కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి. ధర్నాలు గట్రా ఆగిపోయాయి. ఉద్యమాల్లాంటివి సైడ్ అయిపోయాయి. ఢిల్లీపై యుద్ధం అన్న కేసీఆర్.. సంధికి సిద్ధం అన్నట్లు వెళ్లారు. అంతే.. అంతా గప్ చుప్. బండి సంజయ్ మీడియా ముందుకు వచ్చినా.. ఏం మాట్లాడాలో అర్దం కాని పరిస్థితి. మీరే కరెక్ట్ అని సీఎం కేసీఆర్ అంటే.. బండి సంజయ్ మాత్రం ఏం చేయగలరు చెప్పండి. ఇక వెంటనే ఆయుష్మాన్ భారత్ కి కూడా ఓకే అన్నారు. సో.. కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నారు. మరి కేంద్రానికి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్ చేయలేరు కదా. అందుకే.. అలా గప్ చుప్ అయిపోయింది ఎవ్వారం. ముందే గ్రహించిన సీఎం కేసీఆర్.. కార్ టర్న్ తీసుకుని.. బండి వెనకాలే పోనిస్తూ.. సంజయ్ కి ఏం చేయాలో తెలీని సిచ్చువేషన్ లో నుంచోబెట్టాడు. అదీ కేసీఆర్ మార్క్ రాజకీయం అంటే అంటున్నారు.