నల్గొండ, జనవరి 2,
అవును. పొలిటికల్ గా ఏమైనా జరగొచ్చు. ఎప్పుడైనా జరగొచ్చు. టైం గట్రా ఏం ఉండవు. అసలే పాలిటిక్స్ ఇప్పుడు వేడి మీదున్నయ్. తెలంగాణలో ఇంకాస్త హీటెక్కినయ్. ఓ వైపు బీజేపీ బలంగా తయారు అవుతోంది. కాంగ్రెస్ ఏమో వీక్ అవుతోంది. అందుకే.. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కోమటి రెడ్డి బ్రదర్స్.. బీజేపీలో చేరుతారు అనే టాక్ బయటికి వచ్చింది.కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎప్పటి నుంచో.. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం వెయిటింగ్. ఉత్తమ్ టైం నుంచే వారిద్దరికీ ఎక్కడా రాజీ రాలేదు. అంతకు ముందు నుంచే ఉన్న వివాదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నయ్. ఇప్పుడు కూడా అలాగే ఉన్నయ్. ఇక వెంకట రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఉత్తమ్ ఆల్రెడీ రాజీనామా చేశాడు. పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు కూడా రాకపోతే.. ఇక ముందు వస్తుందన్న గ్యారంటీ ఉండదు. అప్పటి దాకా.. కాంగ్రెస్ బలంగా ఉంటుందనే గ్యారంటీ లేదు. సో.. బ్రదర్స్ ఇద్దరూ జంప్ చేస్తారని.. బీజేపీలో చేరతారు అనే టాక్ బయటికి వచ్చింది. ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి అదే కామెంట్స్ చేశారు. బీజేపీ బలపడుతుంది అనే మాటకు నేను కట్టుబడి ఉన్నాను. బీజేపీ బలపడుతుంది కూడా. నేను బీజేపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నారు రాజగోపాల్ రెడ్డి. మా సోదరుడు వెంకటరెడ్డి బీజేపీలోకి వస్తారో రారో తెలీదు కానీ.. నేనైతే చేరే అవకాశాలు ఉన్నయ్ అన్నారు రాజగోపాల్ రెడ్డి.చూస్తుంటే.. కోమటి రెడ్డి బ్రదర్స్ చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి.. పీసీసీ చీఫ్ పదవి ఇస్తే.. కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా జంప్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. తెలంగాణ కాంగ్రెస్ లో బలమైన లీడర్.. వాయిస్ వినిపించే లీడర్.. సీనియర్ లీడర్.. బలమైన కేడర్ ఉన్న లీడర్ వెంకటరెడ్డి. అదీ కాక ఎప్పటి నుంచో పదవి కోసం వెయిటింగ్. అలాంటి వెంకటరెడ్డికి.. పదవి దక్కకుంటే సీరియస్ డెసిషన్ తీసుకుంటారు అనే టాక్ ఉంది. సో.. ఇద్దరూ జంప్ అవుతారా.. ఒక్కరే జంప్ అవుతారా తేలాల్సి ఉంది.