పవర్స్టార్ పవన్కళ్యాణ్ ను డ్యామేజ్ చేస్తూ నెలరోజులుగా సాగుతున్న చర్చలు రచ్చరచ్చకు కారణమయ్యాయి. చివరికి టీడీపీ వర్సెస్ జనసేన అనేంతగా గొడవలు మారిపోయాయి. దీనిపై ఇప్పటి వరకూ టీడీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇకపోతే.. పవన్కు మద్దతు క్రమంగా పెరుగుతుంది. ఫిలింఛాంబర్ వద్దకు వేలాదిగా అభిమానులు చేరుకుని... మీడియాపై దాడికి దిగారు. మెగా ఫ్యామిలీను టార్గెట్ చేసుకుంటూ సాగిన దాడిపై మెగాఫ్యామిలీ ఆందోళనకు సిద్ధమైంది. కోట్లాదిమంది అభిమానులున్న మెగాస్టార్స్ ఒక్కటిగా మారటం.. సినీ వర్గాల్లో కాదు.. యావత్ రాజకీయాల్లోనూ ఊహించని మలుపు అనే చెప్పాలి. హైదరాబాద్ ఫిలింఛాంబర్ వద్ద నిరసనకు దిగిన పవర్స్టార్కు మద్దతుగా.. రామ్చరణ్ నుంచి అందరూ ఒక్క చోటికి చేరారు. శ్రీరెడ్డి వ్యవహారం సాధారణమని భావించినా.. చివరకు అది రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇదంతా వైసీపీ భావించిందని భావించినా.. చివరకు.. ఇది పూర్తిగా చంద్రబాబునాయుడు అండ్ కో ఆడించిన పెద్దడ్రామాగా జనసేన అభివర్ణించింది. స్వయంగా పవన్ కూడా నిన్ను, నీ కుమారుడిని గెలిపించినందుకు నాకు ఇచ్చే బహుమానం ఇదా అంటూ.. చంద్రబాబునాయుడును ఉద్దేశించి ట్వీట్ చేయటంతో ఇప్పటి వరకూ గుప్పెట్లో ఉన్న రహస్యం బయటకు వచ్చినట్టయింది. అమ్మను మాట అన్న తరువాత దాన్ని తిప్పికొట్టలేని కొడుకు బతికినా.. చచ్చినట్టే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించటం.. మరణం గురించి పవన్ స్పందించటం.. భావోద్వేగమైన ఘట్టాలతో ఒక్కసారిగా మెగా అభిమానులందరూ కదలిపోయారు.మరో వైపు ఎక్కడికక్కడ ఆదివారం నుంచి చేపట్టబోయే నిరసనలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్ ఇరు వర్గాల మధ్య యుద్ధాన్ని తలపిస్తున్నాయి. టెర్రిఫిక్ వాతావరణాన్ని తలపిస్తున్న పరిస్థితులు శాంతిభద్రతలపై కూడా ప్రభావం చూపవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాపు సామాజికవర్గ నేతలు కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. భవిష్యత్ ప్రణాళికపై సిద్ధమవుతున్నారు. దాదాపు . ఛాంబర్లో తలుపులు మూసుకుని కూర్చున్న పవన్ బయటకు వచ్చి ఇచ్చే ఆదేశాల కోసం అభిమానులు, జనసైనికులు ఎదురు చూస్తున్నారు. దీనంతటికీ కారణమైన వర్మ వెనుక ఎవరు ఉన్నారు. నిజంగా లోకేష్, టీవీ9 ప్రకాష్ చేపట్టిన ఆపరేషన్ శ్రీరెడ్డి వెనుక వాస్తవాలు ఏమిటనేది తేలితేగానీ.. పవన్ అభిమానులు చల్లారేలా లేరు.