YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గుడులపై దాడులకు ఆ ఇద్దరే కారణం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

గుడులపై దాడులకు ఆ ఇద్దరే కారణం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

విశాఖపట్నం జనవరి 4, 
రాష్ట్రంలో దేవాలయాలుపై జరుగుతున్న దాడులకు ఇద్దరే కారణం. ఒక్కరు సీఎం జగన్ మరొకరు రాష్ట్ర పోలీస్ డిజిపి గౌతమ్ సవాంగ్ లని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రాష్ట్రంలో హిందుత్వాని నాశనం చేయాలని చూస్తున్నారు. వరసగా గుళ్ళు పై దాడులు చేస్తున్నారు. అశోక్ గజపతి రాజు కోసం  మాట్లాడే అర్హత లేని వాళ్ళు ఈ రోజు విమర్శిస్తున్నారు. అశోక్ గజపతిరాజు కుటుంబం కోసం, వారి వంశం కోసం తెలుసుకుని మాట్లాడాలి. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడే తీరు అప్రజాస్వామికం. ముందు దేవాలయాలు పై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలి. అశోక్ గజపతి రాజుకు క్షమాపణ చెప్పాలి. మానస ట్రస్ట్ కోసం కనీసం తెలియని మహిళను చైర్మన్ గా నియమిస్తారా.? విజయసాయిరెడ్డి స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర లో హింసను ప్రేరేపిస్తున్నారు. ప్రజలు సహించరు, తిరగబడటం మొదలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. వోక్స్ వాగన్ కంపెనీ విశాఖ నుంచి వెళ్లిపోవడానికి కారకుడు మంత్రి బొత్స. ప్రజలు బొత్స కోసం తెలుసుకున్నారు. వైకాపా నేతలే ప్రభుత్వ తీరుపై విమర్శించుకుంటున్నారని అన్నారు.
రోజుకు మూడు లక్షల ఇస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పేకాట ఆడేసుకోవచ్చు. పేకాట క్లబ్ నడిపేవాళ్ళు మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. రాష్ట్రంలో దేవాలయాలు పై జరుగుతున్న దాడులపై బిజెపి స్పందించాలి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించాలి. రాష్ట్రంలో జరుగుతున్న  దాడులకు బాధ్యతగా, రాష్ట్ర డీజీపీ ని రీకాల్ చేయాలి. రాష్ట్రంలో దేవాలయాలు పై దాడులు జరుగుతుంటే, ఒక్క పీఠాధిపతి కూడా ఎందుకు మాట్లాడలేదని అయన అన్నారు.

Related Posts