హైదరాబాద్ జనవరి 05
తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్ మంత్రి హరీశ్ రావు మంగళవారం నాడు ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం ఎలక్షన్నలో ప్రయారటీ అంశం. కాని అమల్లో మాత్రం ఆ ప్రాధాన్యత ఉండదు. కాని తెరాస ప్రభుత్వం మాత్రం ఈ పథ్ధతిని మార్చిందని అన్నారు. దేశంలో ఎక్కువగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగంపై ఎక్కువ ఖర్చు చేసింది తెరాస ప్రభుత్వం. వ్యవసాయం దిశ ఈ నాడు మారింది. మంచి విత్తనాలు, కావాల్సినంత ఎరువులు, విద్యుత్, సాగు నీరు , రైతుబంధు, రైతు బీమా వంటివి తెరాస ప్రభుత్వం ఇవ్వగలిగింది. జైకిసాన్ అన్న నినాదాన్ని తెరాస ప్రభుత్వం నిజం చేసి చూపింది. 62 లక్షల రైతు కుటుంబాల్లో వెలుగు రావాలి. వారి ప్రతినిధులు వ్యవసాయ శాఖ ఉద్యోగులే. రైతే రాజు కావాలి. వ్యవసాయ శాఖ నేడు గ్లామరస్ శాఖ అని వ్యాఖ్యానించారు.