YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

అధిక వడ్డీలు వసూలు చేస్తూన్న మైక్రోఫైనాన్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

అధిక వడ్డీలు వసూలు చేస్తూన్న మైక్రోఫైనాన్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

అధిక వడ్డీలు వసూలు చేస్తున్న మైక్రోఫైనాన్స్ పై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో అధిక వడ్డీలు వసూలు చేస్తూ మైక్రో ఫైనాన్స్ నడిపిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ షేక్ మస్తాన్ వారి సిబ్బందితో కలిసి పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఒక మైక్రో ఫైనాన్స్ ఆఫీస్ నీ ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరంకు చెందిన నల్లమిల్లి శివారెడ్డి, పెడపర్తికి చెందిన కొనాల వెంకట రెడ్డి, పడాల వనమారెడ్డి, కామో బసవ సాయికుమార్ లను అరెస్ట్ చేసి 8 బుక్స్ సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం పెద్దపల్లి పోలీసులకు అప్పగించడం జరిగింది.

Related Posts