YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బాసర ఆలయంలో అవినీతి.. బీజేపీ అందోళనలు

బాసర ఆలయంలో అవినీతి.. బీజేపీ అందోళనలు

నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న అవినీతి పై  గత రెండు రోజులుగా నిరసనలు, అందోళనలు కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆలయంలో అవినీతి రాజ్యమేలుతుందని  వచ్చిన   ఆరోపణ లకు  ప్రభుత్వం  ముగ్గురు అధికారుల తో కూడిన  త్రిసభ్య   కమిటీ ని  విచారణ కు నియమించింది. కమిటీ తన విచారణలో  మూడు సంవత్సరాల నుండి బాసర ఆలయంలో సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందని ఆధారాల తో సహా బయట పెట్టింది. కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు ఈ వంద కోట్ల కుంభకోణం లో హస్తo ఉందని ఆరోపిస్తూశనివారం  ఉదయం బీజేపీ కార్యకర్త లు బాసర మండల కేంద్రం నుండి ఆలయo వరకు నిరసన  ర్యాలీ చేపట్టారు.తరువాత  ఆలయ ప్రత్యేకఅధికారి సుధాకర్ రెడ్డి కి కూడ వినతి పత్రం అందించారు. దక్షిణ భారత దేశంలోనే ఏకైక సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం చదువుల తల్లి సరస్వతీ అమ్మవారు తెలంగాణ లో ని బాసర క్షేత్రం లో ఉన్నారని అమ్మవారి ఆలయ ప్రతిష్ట కె భంగం కలిగించే విధంగా స్థానిక నాయకులు ఆలయాధికారులు కుమ్మక్కైయ్యారి వారు ఆరోపించారు.  కోట్ల రూపాయల్లో అవినీతి జరిగినా ఇంతవరకు జిల్లా కు చెందిన  దేవాదాయశాఖ మంత్రి చర్యలు తీసుకోక పోవడం విడ్డూరమన్నారు. అవినీతి అధికారులను బాసర నుండి బదిలీ చేయడం తో పాటు వాళ్ళ పై క్రిమినల్ కేసులను పెట్టి విధుల నుండి వెనక్కి పంపాలని,  వారి ఆస్తులను జప్తు చేయాలని వారు డిమాండ్ చేసారు. బాసర ఆలయం పై ముఖ్య మంత్రి కి ఉన్న చిత్త శుద్ది ని నిరూపించుకోవాలని లేని పక్షంలో ఆమరణ నిరాహారదీక్ష కైనా సిద్దమని ప్రగతి భవన్ ముట్టడికి కూడ వెనుకాడమనీ స్పష్టం చేసారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తప్పు చేసారని రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి కెసీఆర్ అదే విధంగా బాసర ఆలయంలో కూడ అవినీతి బయట పడిన తరుణంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తో కూడా రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి  బాసర కు రాకుండా తిరిగి వెళ్ళారని విమర్శించారు. అమ్మవారి ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటన్నింటిని ఆలయానికి అప్పగించాలని డిమాండ్ చేసారు. 

Related Posts