రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని భారతీ జనతా యువ మోర్చా కార్యకర్తలు ఆర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. రాష్ట్రం లో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతి ని చెల్లించాలి. కరోనా కారణంగా 10 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్ కు, ప్రైవేట్ లెక్చరర్ల కు తక్షణం 10 నులల గౌరవ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలి. ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను వెంటనే అమలుపరచాలని వారు డిమాండ్ చేసారు