YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

యాదాద్రిలో ఇళ్లు కూల్చితే సహించం - మోత్కుపల్లి హెచ్చరిక

యాదాద్రిలో ఇళ్లు కూల్చితే సహించం - మోత్కుపల్లి హెచ్చరిక

యాదాద్రి అభివృద్ధిలో భాగంగా ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా, యాదాద్రి కొండను ఆనుకుని రోడ్డు విస్తరణ చేపట్టాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అభివృద్ధి లో భాగంగా  యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు కింద ఇండ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి, కూల్చివేతకు గురవుతున్న ఇండ్లను మోత్కుపల్లి పరిశీలించారు. వైకుంఠ ద్వారం నుండి గాంధీ విగ్రహం వరకు కూల్చివేతకు గురయ్యే ఇండ్లను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. యాదాద్రి కొండను కొంచెం తొలిచి రోడ్డు నిర్మిస్తే ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా రోడ్డు వేయొచ్చని అధికారులకు మోత్కుపల్లి సూచించారు. అనంతరం కలెక్టర్ అనితారామచంద్రన్ తో ఫోన్ లో మాట్లాడి ఇల్లు కోల్పోకుండా రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ మార్చాలని మోత్కుపల్లి సూచించారు.

Related Posts