YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గ్రామ వాలంటీర్ పై కత్తితో దాడి

గ్రామ వాలంటీర్ పై కత్తితో దాడి

గ్రామ వాలంటీర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పొనుకుమాడులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... పొనుకుమాడుకు చెందిన గాలంకి శివకృష్ణ ప్రగడవరం గ్రామ సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్నారు. ఉదయం అదే గ్రామానికి చెందిన మువ్వా మోహన్‌రావు కత్తితో శివకృష్ణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తలపై నరకడంతో తీవ్రంగా గాయపడిన శివకృష్ణను స్థానికులు చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. గతంలో మోహన్‌రావు కుటుంబసభ్యులు కరోనా బారిన పడినట్లు శివకృష్ణ అధికారులకు చెప్పడంతో అప్పట్లో వారిని ఏలూరు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారని, దీనికి తోడు తన భార్యతో శివకృష్ణ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలియడంతో మోహన్‌రావు కక్ష పెంచుకునే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Related Posts