YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ, టీడీపీ బాహాబాహీ

బీజేపీ, టీడీపీ బాహాబాహీ

నెల్లూరులో బిజేపీ, టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగారు. పరస్పరదాడులు చేసుకున్నారు.  నినాదాలతో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ దద్దరిల్లింది.  ప్రధాని నరేంద్రమోడీపై సిని హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బిజేపీ  ఆందోళన నిర్వహించింది.  బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్దం చేసి ఆయనకు మెంటల్ కండిషన్ సరిగా లేదంటూ  బిజేపీ నాయకులు విమర్శలు చేశారు.  దీంతో బాలకిష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు.  ఈ క్రమంలో బిజేపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.  ఈ ఘర్షణలో ఇద్దరు బిజేపీ నాయకులకు గాయాల్యాయి.. దీంతో గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

Related Posts