YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే పట్టాల రద్దు - మంత్రి కేటీ రామారావు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే పట్టాల రద్దు - మంత్రి కేటీ రామారావు

గ్రేటర్ హైదరాబాద్ లో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే ఆ పట్టాలను రద్దు చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టీ. రామారావు హెచ్చరించారు. నేడు జీహెచ్ ఎంసీ పరిధిలో  రూ. 28.38 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలను శనివారం నాడు రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు చేశారు.. రూ. 10.90 కోట్ల వ్యయంతో బాగ్ లింగంపల్లి లంబాడి తండాలో నిర్మించిన 126 డబుల్ బెడ్ రూం ఇళ్లను, రూ. 3.50 కోట్ల వ్యయంతో అడిక్ మెట్ లో నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు.. వీటితో పాటు రూ. 9.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జోనల్, డిప్యూటి కమిషనర్ కార్యాలయాలకు శంకుస్థాపన, నారాయణగూడ క్రాస్ రోడ్స్ లో రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు  తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ముషీరాబాద్ శాశన సభ్యులు ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బలంగా లంబాడి తండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కె.టీ. రామారావు మాట్లాడుతూ, దేశంలోని 28 రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో రూ. 18 ,000 కోట్ల వ్యయంతో 272000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మానాన్ని చేపట్టామని తెలియచేసారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ రూ. 9,714 వ్యయంతో ప్రారంభించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ళుదాదాపు పూర్తి కావొచ్చాయని తెలిపారు. ఒక్కొక్కటి సుమారు తొమ్మిది లక్షల రూపాయల వ్యయం తో నిర్మించిన ఈ ఇళ్ళు లబ్దిదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని, ఈ ఇళ్లను పొందే లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను అమ్ముకోవడం గానీ ఇతరులకు కిరాయికి ఇవ్వడం గానీ చేయొద్దని స్పష్టంచేశారు. ఇళ్ళు అంటేనే ఆత్మా గౌరవానికి నిదర్శనమని అన్నారు. తమ ఇల్లును ఎలానైతే శుభ్రంగా ఉంచుకుంటారో తమ పరిసరాలను, బస్తీలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని  అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను మురికి వాడల రహిత నగరం గా తీర్చిదిద్దడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా నగరం లోని 40 లొకేషన్లలో ఇన్సిటూ పద్దతిలో 8898 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చేపట్టామని తెలియచేసారు. ఇప్పటికే సింగం చెరువు తండా, చిత్తారమ్మ బస్తి, కిడ్ కీ బాత్ అలీషా, సయ్యద్ సాబ్ కా బడా, ఎరుకల నాంచారమ్మ బస్తి, జియాగూడా, కట్టెలమంది, గోడే కి ఖబర్ లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించామని తెలియ చేశారు. ప్రస్తుతం ఏవిధమైన ఎన్నికలు లేనందున అభివృద్ధికి అందరం కలసి పనిచేద్దామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నగారాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టంచేశారు. ఈ సందర్బంగా లబ్దిదారులకు డబుల్ బెదురూమ్ ఇళ్ల పట్టాలను మంత్రులు అందచేశారు.

Related Posts