YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

నిజామాబాద్ లో దారుణం - భర్తను చంపించిన భార్య

నిజామాబాద్ లో దారుణం - భర్తను చంపించిన భార్య

భర్తతో విసిగిపోయిన భార్య ఇంట్లో అద్దెకు ఉంటున్న కుర్రాడితో డీల్ కుదుర్చుకుంది. రెండు తులాల బంగారం ఇస్తానని.. తన తాళి తెంచేయమని ఒప్పందం చేసుకుంది.తన ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకుడితో ఇంటి ఓనర్ భార్య ఒప్పందం చేసుకుంది. రెండు తులాల బంగారం, డబ్బులు ఇస్తానని.. ఏకంగా ఓనర్‌(కట్టుకున్న భర్త)ని చంపేయమని చెప్పింది. ఓనర్ భార్య మాయలో పడిన యువకుడు తన స్నేహితుడితో కలసి దారుణానికి ఒడిగట్టాడు. ఇంటి ఓనర్‌ని అమానుషంగా అంతమొందించాడు. భార్య మొసలికన్నీరు కార్చడంపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.కామారెడ్డి మండలం రామేశ్వరపల్లిలో ఈ నెల 4వ తేదీన జరిగిన సత్యనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకులతో కలసి భార్యే కట్టుకున్న భర్తను అంతమొందించినట్లు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సత్యనారాయణ, గౌతమి భార్యాభర్తలు. గత కొద్దికాలంగా సత్యనారాయణ మద్యం, పేకాటకు బానిసగా మారాడు. తనకు డబ్బులివ్వాలంటూ నిత్యం భార్య గౌతమిని వేధించేవాడు.
వేధింపులు భరించలేకపోయిన భార్య కట్టుకున్న భర్తను కడతేర్చాలని నిర్ణయించుకుంది. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న యశ్వంత్, అతని స్నేహితుడు దిగంబర్‌లతో డీల్ కుదుర్చుకుంది. రెండు తులాల బంగారం, రూ.15 వేల నగదు ఇస్తానని చెప్పడంతో సత్యనారాయణను హత్య చేసేందుకు ఒప్పుకున్నారు. పథకం ప్రకారం ముగ్గురూ కలసి సత్యనారాయణను అమానుషంగా హతమార్చారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భార్య గౌతమిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు విషయం చెప్పేసింది. భర్త సత్యనారాయణ డబ్బుల కోసం వేధించడంతో హత్య చేసినట్లు అంగీకరించింది. భర్తను హత్య చేసిన గౌతమితోపాటు ఇంట్లో అద్దెకు ఉండే యాశ్వంత్, అతని స్నేహితుడు దిగంబర్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Posts