YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

మానసిక స్థితి సరిగా లేకనే హై టెన్షన్ టవర్ కు ఉరి

మానసిక స్థితి సరిగా లేకనే హై టెన్షన్ టవర్ కు ఉరి

కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారి మల్యాల మండలం నూకపల్లి శివారులోని 132 కె.వి విద్యుత్ టవర్ కు గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడిన సంఘటన కలకలం రేపింది. సదరు వ్యక్తి గురించి విచారించగా ఉరి వేసుకున్న వ్యక్తిని బంధువులు గుర్తించారు. మృతుడు కోడిమ్యాల మండలం తిప్పాయిపల్లి కి చెందిన చిట్టిరెడ్డి గంగాధర్ (28) గా గుర్తించారు. మృతుడు దాదాపు 5 సంవత్సరాల నుండి మతి స్థిమతం
సరిగా లేక సైకో లాగ ప్రవర్తిస్తూ, ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ, జీవితం
పై విరక్తి చెంది నూకపల్లి గ్రామ శివారులోని హై టెన్షన్ టవర్ విద్యుత్ వైర్ కు
తనకు తానుగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడని,మల్యాల ఏ ఎస్ ఐ బి. రామ్మూర్తి తెలిపారు.
మృతుని తండ్రి చిట్టిరెడ్డి గోపాల్ ఫిర్యాదు మేరకు మల్యాల ఏ ఎస్ ఐ బి. రామ్మూర్తి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Related Posts