YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పెరుమాళ్ల పల్లి వద్ద 49 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : వాహనం సీజ్

పెరుమాళ్ల పల్లి వద్ద  49 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : వాహనం సీజ్

పెరుమాళ్ల పల్లి వద్ద ఎస్వీ నగర్ స్మశానం వద్ద వాహనం లోకి లోడ్ చేస్తున్న 49 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాలు మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ వాసుకు అందిన సమాచారం తో ఆర్ ఎస్ ఐ సురేష్, ఎఫ్ బి ఓ జానీ బాషా బృందం గురువారం నుంచి ఎస్వీ జూ పార్క్ వెనుక వైపు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఎస్వీ నగర్ స్మశానం ప్రాంతంలో స్మగ్లర్లు కొందరు అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ వాహనం లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా దుంగలను వదిలి పారిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా తమిళ స్మగ్లర్లు పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గర కుటుంబాలతో గడపడం వారి ఆనవాయితీ అని అన్నారు. బహుశా కరోనా కారణంగా సంపాదన లేక పండుగలలో కూడా సంపాదనకు వచ్చినట్లు భావిస్తున్నామని అన్నారు. దుంగలు దాదాపు ఒకటిన్నర తన్ను ఉంటుందని, కోటి రూపాయల పైన విలువ ఉంటుందని తెలిపారు. స్మగ్లర్లు దుంగలను లోడ్ చేసి తిరిగి అడవుల్లో కి వెళ్లేందుకు నిత్యావసర వస్తువులు సమకూర్చుకున్నారని అన్నారు. ఇందులో ఐదు మూటలు బియ్యం, ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు. పండుగ సమయంలో కూడా విధి నిర్వహణ లో పాల్గొని, భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. సంఘటన స్థలానికి డీఎఫ్ ఓ హిమ శైలజ చేరుకుని, ఎర్రచందనం దుంగలు ఏ ప్రాంతం నుంచి తీసుకుని వచ్చారనే అంశంపై విచారించారు. సిఐ చంద్ర శేఖర్ కే సు నమోదు చేసుకోగా, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ అక్కడకు చేరుకున్నారు.

Related Posts