YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరులో బీజేపీ, టీడీపీ గొడవలు

నెల్లూరులో బీజేపీ, టీడీపీ గొడవలు

ప్రధాని మోదీపై టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బాలకృష్ణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నెల్లూరు పట్టణంలో నిర్వహించిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. మోదీపై వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో అక్కడి వచ్చిన టీడీపీ వర్గీయులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. విజయవాడలోనూ టీడీపీ, బీజేపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తలకు కారణమైంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు సహా పలువురు నేతలు బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాలకృష్ణ ప్రధానిని విమర్శిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే.. సీఎం ముసిముసి నవ్వులు నవ్వారని విమర్శించారు. మరోవైపు.. బాలకృష్ణపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. బాలకృష్ణ పెద్ద తాగుబోతు అని మండిపడ్డారు. ఆయన ఉండాల్సింది అసెంబ్లీలో కాదని, ఎర్రగడ్డ ఆస్పత్రిలో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై తిరుపతి అర్బన్ ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు.

Related Posts