YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మెడికల్ సిటు కోసం భారీగా ఖర్చు

మెడికల్ సిటు కోసం భారీగా ఖర్చు

దేశంలో 60 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. నాలుగు లక్షల మందికిపైగా విద్యార్థులు మెడిసిన్ సీటు కోసం నీట్ రాస్తున్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాల్సి ఉండగా.. ప్రయివేట్ కాలేజీలు అడ్మిషన్ల కోసం భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో మెరిట్ కనబర్చిన విద్యార్థులకు సీటు రావడం కష్టంగా మారగా.. డబ్బు పెట్టి సీట్లు కొనుక్కునే వారికి దర్జాగా సీట్లు దొరికే పరిస్థితి తలెత్తుతోంది. పంజాబ్  రాష్ట్రంలో బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో 8 కాలేజీలు ఉన్నాయి. అందులో మూడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి కాగా, నాలుగు ప్రయివేట్ కాలేజీలు, ఒక ప్రయివేట్ యూనివర్సిటీ.ప్రతి గవర్నమెంట్ కాలేజీలో ఓపెన్ కేటగిరీ విభాగంలో సీటు పొందిన చివరి విద్యార్థి ర్యాంక్ పోలిస్తే.. ప్రయివేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన టాప్ విద్యార్థుల నీట్ మార్కులు తక్కువగా ఉండటం గమనార్హం. ఎంబీబీఎస్ కోర్సుకు గవర్నమెంట్ కాలేజీలో ఫీజు రూ.4 లక్షలు కాగా, ప్రయివేట్ యూనివర్సిటీలో రూ.64 లక్షలు వసూలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా.ప్రయివేట్ విద్యాసంస్థల విషయానికే వస్తే.. ప్రభుత్వ కోటాలో ప్రయివేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు పొందిన వారికి నీట్‌లో మెరుగైన మార్కులు రాగా.. ప్రయివేట్ యూనివర్సిటీల్లో మాత్రం తక్కువ మార్కులొచ్చినా అడ్మిషన్ లభిస్తోంది. ప్రయివేట్ కాలేజీల్లో గవర్నమెంట్ కోటాలో ట్యూషన్ ఫీజు రూ.4 లక్షలు ఉండగా.. ప్రయివేట్ యూనివర్సిటీలు దాదాపు కోటి రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి. ఇలా డబ్బులు కట్టి సీట్లు కొనుగోలు చేసే వారు ఎంబీబీఎస్ పూర్తి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.‘నీట్ వల్ల గతంలో కంటే పరిస్థితి ఎంతో మెరుగైంది. ఎంబీబీఎస్ ప్రవేశాల విషయంలో నియంత్రణ సాధ్యమైంది. కానీ పూర్తిగా మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు సాధ్యం కావడం లేదు. భారీగా డబ్బు ఖర్చు పెట్టి బడాబాబులు సీట్లు కొంటున్నారు. ఫలితంగా మెరుగైన ర్యాంక్ సాధించినప్పటికీ.. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు సీట్లు పొందడం కష్టంగా మారింది. ప్రభుత్వం మరిన్ని మెడికల్ కాలేజీలను ప్రారంభించాల’ని బాబా ఫరీద్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజ్ బహదూర్ కోరారు.

Related Posts