YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వ్యాక్సినేషన్ లోనూ... భారత్ రికార్డ్

వ్యాక్సినేషన్ లోనూ... భారత్ రికార్డ్

న్యూఢిల్లీ, జనవరి 18, 
వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన తొలిరోజైన జనవరి 16న దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఎక్కించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అడిషనల్ సెక్రటరీ మనోహన్ అగ్నాని ప్రకటించారు.కరోనా వైరస్‌ నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మహా క్రతువులో భారత్‌ రికార్డు నెలకొల్పింది. పెద్ద స్థాయిలో టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన తొలిరోజైన జనవరి 16న దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఎక్కించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అడిషనల్ సెక్రటరీ మనోహన్ అగ్నాని ప్రకటించారు. ఈ సంఖ్య అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో కలిపి ఒకేరోజు వేసిన సంఖ్య కంటే ఇంకా ఎక్కువని వెల్లడించారు.మొదటి రోజు రెండు లక్షల 7 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, రెండో రోజు 17 వేల మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఇప్పటి వరకు 2,24,301 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా తీసుకున్న వారిలో 447 మందికి కాస్త సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని తెలిపారు. అయితే, అవి కేవలం సాధారణమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటివి మాత్రమేనని చెప్పారు. వీరిలో ముగ్గురికి మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిచాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్యంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 553 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. రెండో రోజు మొత్తం 17,072 మందికి వ్యాక్సిన్‌ అందించాం. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నాడు టీకా పంపిణీ కొనసాగింది. వ్యాక్సిన్‌ పంపిణీపై అన్ని రాష్ట్రాలతో ఇప్పటికే సమీక్ష జరిపాం.’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదనపు కార్యదర్శి మనోహర్‌ వెల్లడించారు.

Related Posts