YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఎయిర్ టెల్ కొత్త ఆఫర్

ఎయిర్ టెల్ కొత్త ఆఫర్

ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.49కే 3జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నది. రూ.49తో రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు 3జీబీ 4జీ డేటా లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే. అయితే ఈ ప్లాన్ కేవలం ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే.. ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేసి అందులో ప్లాన్ల వివరాలను చూసుకోవాలి. వాటిల్లో రూ.49కి 3జీబీ డేటా అని ఉంటుంది. ప్లాన్ అందుబాటులో లేకపోతే రూ.49కు కేవలం 1జీబీ డేటా మాత్రమే వస్తుంది. ఇక మరో వైపు జియోలో రూ.49కు 1జీబీ డేటా మాత్రమే లభిస్తుండగా, ఇందులో అన్‌లిమిటెల్ కాల్స్, 50 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. 

Related Posts