YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

23న కామన్ వెల్త్ సభ్యులకు సన్మానం

 23న కామన్ వెల్త్ సభ్యులకు సన్మానం

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కామన్వెల్త్ విజేతలు శనివారం ఉదయం కలిశారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను సీఎం అభినందించారు. ఈ నెల 23న కామన్వెల్త్ విజేతలకు ఎల్బీ స్టేడియంలో సన్మానం, అభినందన సభ నిర్వహించనున్నారు. 5 రాష్ర్టాలకు చెందిన 18 మంది క్రీడాకారులు సీఎంను కలిశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారని క్రీడాకారులను సీఎం అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం అన్నారు.కామన్వెల్త్‌ గేమ్స్‌లో అద్భుతంగా రాణించారంటూ.. క్రీడాకారులను కేసీఆర్ కొనియాడారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు శాలువాలు కప్పి సన్మానించారు. బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ను కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.కామన్వెల్త్‌లో తెలంగాణకు చెందిన వారు మెడల్స్‌ సాధించడంపై కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారని ప్రశంసించారు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 23న కామన్వెల్త్ విజేతలకు ఎల్బీ స్టేడియంలో సన్మానం, అభినందన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Related Posts