సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్కు ఓ మీడియా సంస్థ యజమాని శ్రీని రాజు నోటీసులు పంపారు. తనను ఉద్దేశించి ట్విటర్లో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు ట్విటర్లో పవన్ వ్యాఖ్యలు నిరాధారం, అసత్యాలని ఆరోపించారు. ఈ మేరకు శ్రీనిరాజు తన తరఫు న్యాయవాది నుంచి పవన్కు నోటీసులు పంపారు.పవన్ తనపై ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు తెలిసి శ్రీనిరాజు షాక్ అయ్యారని న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు. నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే.. మిగిలిన రాజకీయ నాయకులకూ పవన్కు తేడా ఏంటని ప్రశ్నించారు.శ్రీనిరాజుకు ప్రత్యక్షంగానూ, పరోక్ష్యంగానూ చిత్ర దర్శకుడు రామ్గోపాల్ వర్మతో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. వర్మ, రవి ప్రకాశ్తో కలిసి శ్రీనిరాజు టీడీపీ నేతలకు సాయం చేస్తూ.. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సహకరించారని చెప్పడం కేవలం ఊహాజనితమేనని తన క్లయింట్ అన్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ప్రజలు తనపై ఆరోపణలు చేసినప్పుడు పవన్ ఎంత బాధపడ్డారో.. ఇప్పుడు పవన్ చేసిన ఈ నిరాధార వ్యాఖ్యలకు తన క్లయింట్ కూడా అంతే బాధపడ్డారని చెప్పారు.