YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

23న ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కేంద్రం ప్రారంభం

23న ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్  కేంద్రం ప్రారంభం

 రాష్ట్రంలో సైబర్ నేరాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీ-2017ను గతేడాది అమల్లోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్(ఏపీసీఎస్సీఓసీ)ను ప్రారంభించనుంది. ఈ కేంద్రాన్ని ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు సీఎం నారా చంద్రబాబునాయుడు తన నివాసం సమీపంలో ఉండవల్లిలోని కరకట్టవద్ద ఉన్న గ్రీవెన్స్ హాలులో ప్రారంభించనున్నారని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 

Related Posts