YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

భర్త వీర్యంపై పూర్తి హక్కు భార్యకే - కోల్ కత్తా హైకోర్టు కోర్టు కీలక తీర్పు!

భర్త వీర్యంపై పూర్తి హక్కు భార్యకే - కోల్ కత్తా హైకోర్టు కోర్టు కీలక తీర్పు!

;మరణించిన వ్యక్తి వీర్యంపై ఆ మృతుడి భార్యకి మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని కోల్ కతా హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. భార్య కాకుండా ఇతరులు ఎవరైనా దానిపై హక్కులు పొందాలంటే.. తప్పనిసరిగా ఆ భార్య అనుమతి తీసుకోవాల్సిందే అని వెల్లడించింది.   చనిపోయిన తన కుమారుడి వీర్యం కోసం తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అరుదైన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ...కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి 2015లో ఢిల్లీకి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అతడు అప్పటికే తలసేమియాతో బాధపడుతుండేవాడు. ఢిల్లీ ఆస్పత్రిలో ఇందుకు సంబంధించి చికిత్స తీసుకునేవాడు. 2018లో అతడు మరణించాడు. అయితే మరణానికి ముందే ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో అతడి వీర్యాన్ని భద్రపరిచాడు. 2020 మార్చిలో ఆ వ్యక్తి తండ్రి స్పెర్మ్ బ్యాంకును సంప్రదించాడు. అక్కడ భద్రపరిచిన చనిపోయిన తన కుమారుడి తాలూకూ వీర్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు స్పెర్మ్ బ్యాంక్ నిరాకరించింది. కుమారుడి వీర్యాన్ని అతడి భార్యకు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది.ఆ వీర్యాన్ని అతడి భార్య గర్భం దాల్చడానికి ఉపయోగించాలన్నా లేదా వేరే వాళ్ల కోసం వాడాలనుకున్నా పడేయాలనుకున్నా.. అది కేవలం భార్య అనుమతితోటే సాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. దీనితో ఆ తండ్రి తమ కోడలి నుంచి వీర్యం విషయమై నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వవల్సిందిగా కోరాడు. అందుకు ఆమె తిరస్కరించింది. ఈ పరిణామంతో చేసేదేంలేక ఆయన కోల్ కతా కోర్టును ఆశ్రయించాడు. తమ కొడుకు వీర్యాన్ని కోడలు తమకు దక్కకుండా చేస్తోందంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ వీర్యం ధ్వంసమైనా లేదా నిరుపయోగమైనా తమ వంశం నాశనం అవుతుందని పిటిషన్ లో కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు ను వెల్లడించింది.

Related Posts