YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

చైనా దళాలను ఉపసంహరిస్తేనే...భారత్ వెనక్కి... రాజ్‌నాథ్ సింగ్

చైనా దళాలను ఉపసంహరిస్తేనే...భారత్ వెనక్కి... రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ జనవరి 23 
 స‌రిహ‌ద్దుల నుంచి చైనా త‌మ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించ‌నంత వ‌ర‌కు తాము కూడా ద‌ళాల‌ను వెన‌క్కి పంపించ‌మ‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.  ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.  ల‌డాఖ్ స‌రిహ‌ద్దులో చైనాతో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌స్య‌ను చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించే న‌మ్మ‌కం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. సరిహ‌ద్దుల్లో భార‌త్ త‌న మౌళిక‌స‌దుపాయాల‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. అయితే చైనా కొన్ని ప్రాజెక్టుల‌ను అడ్డుకుంటోంద‌న్నారు.  ద‌ళాల సంఖ్య‌ను త‌గ్గించ‌బోమ‌ని, చైనా ఆ ప్ర‌క్రియ మొద‌లుపెట్ట‌నంత వ‌ర‌కు తాము కూడా ద‌ళాల‌ను త‌గ్గించ‌మ‌ని మంత్రి వెల్ల‌డించారు. చైనాతో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు డెడ్‌లైన్ లేద‌న్నారు.  ఆ స‌మ‌స్య‌కు తేదీని ఖ‌రారు చేయ‌లేమ‌న్నారు. చ‌ర్చ‌ల‌తో స‌మ‌స్య ప‌రిష్కృత‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో  చైనా ఓ గ్రామాన్ని నిర్మిస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పైన కూడా మంత్రి స్పందించారు. ఆ నిర్మాణం చాలా ఏళ్ల నుంచి సాగుతున్న‌ట్లు మంత్రి చెప్పారు.   

Related Posts