YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి రూటే సపరేటు...

మంత్రి రూటే సపరేటు...

హైదరాబాద్ జనవరి 23
తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి అంటే తెలియని వారు ఉండరేమో. అప్పుడప్పుడు ఆయన ప్రసంగాలు సోషల్మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. పక్కా తెలంగాణ యాసలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుంటారు. అనేక సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లో చాలా ఫేమస్. అయితే రీసెంట్గా మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు.  అయోధ్య రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీనితో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ కనిపించినా.. బీజేపీ కార్యకర్తలు హిందుసంఘాల వాళ్లు అడ్డగించి నిరసన తెలుపుతున్నారు. అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా మేడ్చర్ నియోజకవర్గంలో రైతు వేదికలు ప్రారంభించేందుకు వెళ్దామనుకున్నారు. కానీ రైతు వైదికలవద్ద బీజేపీ కార్యకర్తలు కాచుకొని ఉన్నారని మంత్రికి సమాచారం అందింది. దీంతో మంత్రి వెంటనే రాంగ్రూట్లో వెళ్లారు.  మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలో మంత్రి రైతు వేదికలు ప్రారంభించాల్సి ఉన్నది.అయితే మజీద్ పూర్ రాజీవ్ రహదారిపై వద్ద మంత్రి కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు బీజేపీ కార్యకర్తలు వేచి చూస్తున్నారు.దీంతో మంత్రి కాన్వాయ్ అలియాబాద్ చౌరస్తా వరకు రాజీవ్ రహదారిలో రాంగ్ రూట్లో వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. అయితే మంత్రిగారి కాన్వాయ్కు చలాన్లు విధిస్తారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Related Posts