YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ను కలిసిన పవన్ కళ్యాణ్

ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ను కలిసిన పవన్ కళ్యాణ్

ఒంగోలు జనవరి 23, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్త వెంగయ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి పవన్ ఫిర్యాదు చేశారు. ఘటనతో పాటు అనంతర పరిణామాలను ఎస్పీకి వెంగయ్య కుటుంబ సభ్యులు వివరించారు. 
అంతకుముందు ఉదయం జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నెల 18న బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపుల వల్ల వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ అందచేశారు. వెంగయ్య నాయుడు పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ వెంట జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts