YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఇద్దరు కూతుర్లను హతమార్చిన తల్లిదండ్రులు

ఇద్దరు కూతుర్లను హతమార్చిన తల్లిదండ్రులు

మదనపల్లె జనవరి 25, చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్లో ఆదివారం రాత్రి  దారుణం వెలుగు చూసింది.  క్షుద్రపూజలు పేరుతో కన్న బిడ్డలనే దారుణంగా హత్య చేసిన ఘటన  సంచలనం  కలిగించింది  శివనగర్కు చెందిన ఎన్.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె బోపాల్లో పీజీ చేస్తుండ, చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. వీరంతా గత ఏడాది ఆగస్టులో శివనగర్లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్తో కొట్టి హతమార్చారు. తల్లి తండ్రులు కు క్షుద్రపూజలు పై ఆసక్తి అధికంగా ఉండటంతో కన్న బిడ్డలు పైనే వారు క్షుద్ర పూజలు ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు ఆడపిల్లలు పైనే వారు క్షుద్రపూజలు పేరుతో కిరాతకంగా దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యా స్థలం లో రెండు గదుల్లో అచేతనంగా హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Related Posts