YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మదనపల్లి కేసులో కొత్త ట్విస్టులు

మదనపల్లి కేసులో కొత్త ట్విస్టులు

హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతుల తల్లిదండ్రులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. హత్యానేరం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తండ్రి పురుషోత్తంనాయుడు ఏ1, తల్లి పద్మజ ఏ2గా పేర్కొన్నారు.. నిందితులను మదనపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇద్దర్ని సాయంత్రం కోర్టులో హాజరుపరిచరు.
ఇద్దర్ని అరెస్ట్ చేస్తున్న సమయంలో తల్లి పద్మజ వింతగా ప్రవర్తించారు. చేతుల్ని తిప్పుతూ డ్యాన్స్ చేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అంతేకాదు ఇంట్లో పోలీసులతో ఆమె గొడవపడింది. ఈ రోజు అవకాశం ఇవ్వండి అంటూ వేడుకుంది. రేపటిలోగా ఇద్దరు బిడ్డలు బ్రతికి వస్తారంటూ పిచ్చి, పిచ్చిగా మాట్లాడింది. పూజ గదిలోకి బూట్ల తో వెళ్ల వద్దంటూ వాదనకు దిగింది. కూతుళ్లను దారుణంగా హత్య చేశామనే పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. పురుషోత్తం నాయుడులో కాస్త బాధ కనిపించినా.. ఆమె మాత్రం దర్జాగా వెళ్లి పోలీసుల వాహనంలోకి వెళ్లి కూర్చుంది. కరోనా టెస్టుకు తల్లి పద్మజ సహకరించలేదు.. కరోనా శివుడి నుంచి వచ్చిందని.. శివుడికి కరోనా టెస్ట్ ఏంటని పిచ్చిగా మాట్లాడారు.. టెస్ట్ చేయించుకోనని చిందులు తొక్కారు. చెత్తను కడిగేయడానికి తన శరీరం నుంచి కరోనాను పంపించానూ అంటూ పెద్దగా అరిచారు.. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.ఆదివారం రాత్రి పద్మజ, పురుషోత్తమనాయుడు అలేఖ్య, దివ్యలను కిరాతకంగా హత్య చేశారు. మూఢ నమ్మకాలతో పూజలు చేసి దారుణండ డంబెల్‌తో తలపైకి కొట్టి చంపారు.. ఇద్దరిని మళ్లీ బతికిస్తామంటూ పిచ్చి చేష్టలు చేశారు. సోమవారం తండ్రి పురుషోత్తమ నాయుడు ఇద్దరికి అంత్యక్రియలు నిర్వహించారు.. ఇవాళ ఈ కేసులో తల్లిదండ్రుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Posts