హైదరాబాద్, జనవరి 27,
కాంగ్రెస్ అంటే రచ్చ. రచ్చ అంటే కాంగ్రెస్. ఓ కట్టుబాటు అంటూ లేని పార్టీ.. స్వేచ్ఛ మితిమీరి ఉన్న పార్టీ ఏదైనా ఉందీ అంటే.. అది కూడా కాంగ్రెస్ పార్టీనే. అలా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా లాగించుకొస్తోంది. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఇప్పుడు డిసిప్లీన్ అనే మాటే వినిపించకుండా పోతోంది. అసలు యాక్షన్ తీసుకునే నాయకుడే లేకపోవడం.. దారి చూపించే నేత లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లీడర్లు భారీ భారీ కసరత్తులు చేస్తున్నారు. కమిటీలు, సమావేశాలు రివ్యూ మీటింగ్ లు మామూలుగా లేవు. గెలిసేది లేదు ఏం లేదు ఎవరో ఒకరిని నియమించుకునే కాడికి.. ఎందుకీ లొల్లి అనే కామెంట్లు కూడా బాగానే వినిపిస్తున్నయ్ అలాంటి వారికి.. అద్దిరిపోయే ఆన్సరిచ్చేలా కలిసి కట్టుగా మూకుమ్మడిగా నడిచి.. గెలిచి చూపించి ఇదీ మా పవర్ అనాలి. కానీ.. కాంగ్రెస్ లీడర్లు ఏమో.. ఒకరికి ఒకరంటే పడక.. ఎవరి ఆన్సర్లు వాళ్లిస్తూ లైట్ తీసుకుంటున్నారు. లేదంటే రచ్చకు దిగుతున్నారట. పాపం కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ ఠాకూర్ కి తలనొప్పి తప్పడం లేదట. ఎమ్మెల్సీ అభ్యర్థిని నియమించమని చెప్పి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కమిటీ వేశారు ఠాకూర్. ఆయన ఫైనల్ చేసిన పేరునే.. సోనియా గాంధీ అప్రూవల్ కోసం పంపిస్తామన్నారు. అయితే ఖమ్మం నల్గొండ వరంగల్ అభ్యర్థి విషయంలో మాత్రం ఎటూ తేలడం లేదు. ఇక్కడి అభ్యర్థిని ఫిక్స్ చేయాల్సిన బాధ్యత లోకల్ లీడర్లకి ఇవ్వడంతో ఇష్యూ అయి కూర్చుందిఈ అభ్యర్థి విషయంలో డిస్కషన్ బానే హాట్ హాట్ గా నడిచింది. కోదండరామ్.. చెరుకు సుధాకర్ రెడ్డిలకు మద్దతు ఇవ్వకుండా అభ్యర్థిని నియమించాలి అని డిసైడ్ అయ్యారు. సీనియర్ల సలహా మేరకు అలా మూవ్ అవుతున్నారు. కానీ.. ఇక్కడ అభ్యర్థిని డిసైడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదే విషయంపై సీనియర్ల సలహాలకీ.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ లెక్కలకి తేడా కొడుతోంది. ఆయన సమీక్షలు చేస్తుంటే.. వీళ్లేమో.. గ్రౌండ్ లెవల్ కి వెళ్లి తెలుసుకుందాం అంటున్నారట. అలాగే.. ఆల్రెడీ పేరు డిసైడ్ అయిన తర్వాత.. ఇక సమీక్షలు ఎందుకు అంటున్నారట. ఇలా ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్లు నడుస్తున్నాయి డిస్కషన్లు. ఇక పోతే.. సాగర్ రివ్యూ మీటింగ్ కూడా అలాగే ఉంది. అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ పై కూర్చున్నప్పుడు ఇంకెంత హాట్ గా ఉంటుందో.. ఇంకెంత రచ్చగా మారుతుందో చూడాలి