YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

జ‌న‌వ‌రి 28న జాతీయ స్థాయి భ‌గ‌వ‌ద్గీత పోటీలు

జ‌న‌వ‌రి 28న జాతీయ స్థాయి భ‌గ‌వ‌ద్గీత పోటీలు

 టీ టీ డీ హిందూధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో జ‌న‌వ‌రి 28, 29వ తేదీల‌లో విద్యార్థుల‌కు భ‌గ‌వ‌ద్గీత పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.
 
గ‌త నెల‌లో ఆంధ్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క, కేర‌ళ‌ రాష్ట్రాల్లోని 6 నుండి 9 వ తరగతి వ‌ర‌కు గ‌ల‌ విద్యార్ధినీ విద్యార్థులకు శ్రీమద్భగవద్గీతపై పోటీలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇందులో ప్ర‌థ‌మ బ‌హుమ‌తులు పొందిన విద్యార్ధినీ విద్యార్థులకు జ‌న‌వ‌రి 28వ తేదీ గురువారం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌వ‌రి 29న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.

         కోవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూనే విద్యార్థినీ విద్యార్థులు పోటీల‌లో పాల్గొన‌వ‌ల‌సి ఉంటుంది.

Related Posts