YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వార్ - కొడంగల్ లో వేడిక్కిన రాజకీయం

కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వార్ - కొడంగల్ లో వేడిక్కిన రాజకీయం

ఒక దినపత్రికలో వచ్చిన కథనానికి కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ ప్రతి సవాల్
దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ చౌరస్తాలో చర్చకు రావాలంటూ ఎమ్యెల్యే పట్నం సవాల్

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో గత వారం నుండి రాజకీయం వేడెక్కింది. కొడంగల్ ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి లో కొడంగల్ రూపు రేఖలు మారుస్తున్నడని ఒక దినపత్రికలో వచ్చిన కథనానికి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎమ్యెల్యే గారిని అభినందించారు. దానికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ నా హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు రంగులు వేసి మేము చేశాము అని చెప్పుకుంటున్నారని 2018 తరువాత ఒక్క అభివృద్ధి అయిన జరిగిందా! కొడంగల్ లో పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు. దీనిపై కొడంగల్ ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొడంగల్ చౌరస్తాలో అంబెడ్కర్ సాక్షిగా చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు.దీనికి స్థానిక కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు చర్చలకు సవాల్ ప్రతి సవాల్ విసురుకున్నారు నేడు ఇరు పార్టీల స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో కోస్గి శివాజీ చౌరస్తాకు చేరుకున్నారు . ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని ముందస్తుగా గ్రహించిన పోలీసులు అధికారులు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.టిఆర్ఎస్ నాయకులు చర్చలకు సిద్ధంగా ఉన్నాం అంటూ రోడ్ పై బైఠాయించి నిరసన తెలిపారు పోలీసులు టిఆర్ఎస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేసి పోలీస్ వాహనంలో వేరే ప్రాంతానికి తరలించారు.

Related Posts