YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

స్మార‌కంగా మారిన జ‌య‌ల‌లిత వేద నిల‌యం

స్మార‌కంగా మారిన జ‌య‌ల‌లిత వేద నిల‌యం

చెన్నైజనవరి 28  త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జే జ‌య‌ల‌లిత ఇంటిని స్మార‌కంగా మార్చేశారు.  పోయెస్ గార్డెన్‌లోని వేద నిల‌యం నివాసాన్ని స్మార‌కంగా మారుస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ జ‌రిగిన ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఆ రాష్ట్ర సీఎం ఎడిప్పాడి కే ప‌ళ‌నిస్వామి ఆ స్మార‌కాన్ని ఓపెన్ చేశారు.  కోర్టు ఆదేశాల ప్ర‌కారం స్మార‌కంలోకి ప్ర‌జ‌ల‌ను అనుమ‌తించ‌నున్నారు. కానీ ప్ర‌భుత్వం ఆ ఇంటి తాళాలు మాత్రం కోర్టు వ‌ద్దే ఉండ‌నున్నాయి.  జ‌య‌ల‌లిత వారసులు జే దీప‌, జే దీప‌క్‌లు.. పోయెస్ గార్డెన్ ఇంటిని స్మార‌కంగా మారుస్తామ‌ని గ‌తంలో కోర్టులో స‌వాల్ చేశారు.  అయితే ఈ కేసులో జ‌స్టిస్ ఎన్ శేష‌సాయి మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేశారు. జ‌య ఇంటిని స్మార‌క కేంద్రంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ఆ ఇంటి తాళాలు జిల్లా క‌లెక్ట‌ర్ లేదా ఏదైనా అధికారి వ‌ద్ద ఉంటాయ‌ని కోర్టు చెప్పింది.  సింగిల్ బెంచ్ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కోర్టును ఆశ్ర‌యించింది.  శుక్ర‌వారం మ‌ళ్లీ ఈ కేసులో వాద‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రో వైపు మెరీనా బీచ్‌లో ఫీనిక్స్ ఆకారంలో నిర్మించిన జ‌య స్మార‌కాన్ని సీఎం ప‌ళ‌నిస్వామి రిలీజ్ చేశారు. జ‌య‌ల‌లిత మిత్రురాలు శ‌శిక‌ళ విడుద‌లైన మ‌రుస‌టి రోజే పోయెస్ గార్డెన్‌ను స్మార‌కంగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.  

Related Posts