YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం తెలంగాణ విదేశీయం

రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా తెలంగాణ : జపాన్ కాన్సుల్ జనరల్.టాగా

రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా తెలంగాణ : జపాన్ కాన్సుల్ జనరల్.టాగా

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జపాన్ కాన్సుల్ జనరల్.టాగా మాసాయుకి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా బిఆర్ కెఆర్ భవన్ లో కలిసారు. తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  నాయకత్వంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా అవతరించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాన్సుల్ జనరల్ కు వివరించారు. ఈ విషయమై కాన్సుల్ జనరల్ అభినందిస్తూ, ఆసక్తిని వ్యక్తపరిచారు. ఈ సమావేశంలో ఇరువురికి ఉపయోగపడే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సి.యస్ రాసినతన పుస్తకం "మేథడ్స్ ఫర్ కమ్మూనిటీ పార్టీసిపేషన్ ఇన్ జపనీస్ ను కాన్సుల్ జనరల్ కు బహుకరించారు. టాగా పుస్తక స్వీకరణ సందర్భంగా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని ప్రదర్శించారు.

Related Posts