YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి. ఈ నెల 31తో నామినేషన్ల గడవు పూర్తి కానున్నది. మొదటి దశ కింద ఫిబ్రవరి 9న విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3345 గ్రామా పంచాయతీలకు వాటిలోని

33794 వార్డులకు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.  ఎన్నో ఉత్కంఠల మధ్య ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికలు ఇప్పుడు

నిర్వహించడం వీలు కాదని ప్రభుత్వం.. ఎన్నికలు పెట్టి తీరాల్సిందేనని ఎన్నికల సంఘం పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు రాజ్యాంగసంస్థలు సుప్రీంకోర్టు దాకా వెళ్లాయి.అయితే ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు కూడా ఒకే

చెప్పడంతో చివరకు ప్రభుత్వం దిగివచ్చింది. ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మొదలైందిఅదేరోజు ఫలితాలు కూడా

వెల్లడించనున్నారు.ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఎన్నికల సంఘం.. ఇటు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఎన్నికలసంఘం దూకుడుగా వెళ్తున్నది. ఇప్పటికే పలువురు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ

చేసింది. మరోవైపు వాళ్లకు ఏపీ ప్రభుత్వం మరింత ఉన్నత స్థాయి పోస్టింగ్లు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరువ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.

Related Posts