YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మదనపల్లి ఘటన మరువకముందే..చిత్తూరు జిల్లాలో మరో ఘటన

మదనపల్లి ఘటన మరువకముందే..చిత్తూరు జిల్లాలో మరో ఘటన

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు ఘటన మరువకముందే చిత్తూరు జిల్లాలో మరో సంచలన ఘటన వెలుగులోకొచ్చాయి. చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం మార్చేపల్లి గ్రామానికి చెందిన గణేష్

అనే యువకుడు డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. తాను దేవుడి వద్దకు వెళుతున్నానంటూ లేఖ రాసి కనిపించకుండాపోయాడు. జనవరి 21 నుంచి యువకుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు తీవ్ర భయాందోళన

చెందుతున్నారు.
మదనపల్లె ఘటన నేపథ్యంలో తమ బిడ్డకు ఏమీ జరగకూడదని కోరుకుంటున్నారు. అదృశ్యమైన యువకుడికి భక్తి భావాలు మెండుగానే ఉన్నాయని అతను రాసిన లేఖ ద్వారా తెలుస్తోంది. గణేశ్ రాసి సూసైడ్ లేఖ లో నేను దేవుడి దగ్గరకు

వెళ్లిపోతున్నా..నేను చనిపోయానని మీరు బాధపడొద్దు..నేను తిరిగి తమ్ముడి కొడుకుగా పుడతానని రాసి పెట్టి ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో మదనపల్లె ఘటనలాగా తమ కొడుకు ఏమైపోతాడోనని తల్లిడిల్లిపోతున్న గణేశ్ తల్లిదండ్రులు వెంటనే

పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  గంగవరం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతడి కాల్ డేటా వివరాలను సేకరించి.. పలువురిని

విచారిస్తున్నారు.

Related Posts