హైదరాబాద్ జనవరి 29
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి ప్రత్యేక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. బీఫ్ ఫెస్టివల్ వివాదంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఐదేళ్ల క్రితం బొల్లారం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన ఫెస్టివల్ను అడ్డుకునేందుకు రాజాసింగ్ యత్నించారు. ఈ క్రమంలో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు పోలీసులు.