YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలు

సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభ్యత్వాల రద్దు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. సభ్యత్వాల రద్దు చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఆర్‌ఎస్ హైకోర్టు మెట్లెక్కింది. ఈ తీర్పును పరిగణలోకి తీసుకోవద్దంటూ అత్యవసర పిటిషన్‌ వేశారు. మొత్తం 12మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్లారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది బుధవారం  తేలనుంది. సభ్యత్వాల రద్దు వ్యవహారానికి పుల్‌స్టాప్ పడినట్లేనని అందరూ భావించారు. కాని ఈలోపే టీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. ప్రసంగ ప్రతుల్ని చించి విసిరేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి హెడ్‌ఫోన్స్ విసరడంతో... అవి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ కంటికి తగిలి గాయం కాగా... ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీన్ని సీరియస్‌గా తీసుకొన్న స్పీకర్... ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయగా... కొంతమంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్స్ వరకు సస్పెండ్ చేశారు. సభ్యత్వాల రద్దుపై కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేయగా... ఈ నిర్ణయం చెల్లదంటూ సింగిల్ జడ్జి తీర్పును ప్రకటించారు. 

Related Posts