YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ దేశీయం

మోడీ ప్రసంగంలో బోయినపల్లి మార్కెట్

మోడీ ప్రసంగంలో బోయినపల్లి మార్కెట్

హైదరాబాద్, ఫిబ్రవరి 1, 
కింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కుళ్లిపోయిన కూరగాయల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని బోయిన్‌పల్లి మార్కెట్‌లోని కూరగాయల వ్యాపారులు నిర్ణయించిన విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ గుర్తు చేశారు. ఈ ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని.. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.కూరగాయల మార్కెట్‌లలో వివిధ కారణాల వల్ల రోజూ టన్నుల కొద్ది కూరగాయలు కుళ్లిపోతుంటాయన్నారు మోదీ. ఇలా కుళ్లిపోయిన కూరగాయలను పారబోయకుండా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలని హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు నిర్ణయించారని ప్రధాని పేర్కొన్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ కూరగాయల వ్యాపారుల నిర్ణయం నూతన ఆవిష్కరణల శక్తికి నిదర్శనమని ప్రధాని కొనియాడారు.వ్యాపారులు తీసుకున్న ఈ నిర్ణయంతో చెత్త కూడా సంపదగా మారబోతున్నదని ప్రధాని చెప్పారు. దీన్ని చెత్తను బంగారంగా మార్చే ప్రక్రియగా చెప్పుకోవచ్చని ఆయన మెచ్చుకున్నారు. అక్కడ ప్రతిరోజు దాదాపు 10 టన్నుల వరకు కూరగాయల వ్యర్థాలు పోగవుతాయని, వాటి నుంచి రోజుకు 30 కిలోల బయో ఇంధనంతోపాటు 500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి అవుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

Related Posts