YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

మయన్మార్‌ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు

మయన్మార్‌ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు

న్యూఢిల్లీ ఫిబ్రవరి 1 మయన్మార్‌ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు  ఆ దేశ అధ్యక్షుడు సహా ఆంగ్‌ సాన్‌ సూకీ, ఇతర నేతల నిర్బందం ఏడాదిపాటు ఎమర్జెన్సీ విధింపు భారత్‌ తీవ్ర ఆందోళన
మయన్మార్‌ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడు సహా ఆంగ్‌ సాన్‌ సూకీ, ఇతర నేతలను నిర్బంధించడంపై భారత్‌ సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్‌లో నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ పార్టీ గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపిస్తూ విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసింది. దీనిపై ఎలాంటి ఆధారాలు లేవంటూ సైన్యం చేసిన ఫిర్యాదును తోసిపుచ్చింది. ఈ క్రమంలో సోమవారం పార్లమెంట్‌ సమావేశం కానున్న నేపథ్యంలో సైన్యం తిరుగుబాటు చేసింది. సోమవారం తెల్లవారుజామున  ఆంగ్‌ సాక్‌ సూకీతో పాటు అధ్యక్షుడు విన్ మైయింట్ ను  అదుపులోకి తీసుకోవడంతో ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పలువురు ప్రజాప్రతినిధులను కుడా సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై భారత  విదేశాంగ స్పందించింది. ప్రజాస్వామ్య ప్రక్రియకు భారత్‌ ఎల్లప్పుడు మద్దతు ఉంటుందని, చట్ట పాలన.. ప్రజాస్వామ్య ప్రక్రియను తప్పక సమర్థించాలని సూచించింది. ప్రస్తుతం మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తిరుగుబాటును అమెరికా సైతం ఖండించింది. రాజకీయ వేత్తలను, ప్రభుత్వ అధికారుల‌ను రిలీజ్ చేయాల‌ని ఒక ప్రకటనలో కోరింది.  

Related Posts