YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ

శ్రీవారిని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ

తిరుమల ఫిబ్రవరి 4, 
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ దర్శించుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ప్రార్థించానని నిమ్మగడ్డ తెలిపారు. అలాగే ఎంపీ జీవీఎల్ నరసింహరావు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రజలందరూ విరాళిస్తున్నారన్నారు. హిందువులకు అయోధ్య రామాలయం ఆరాధ్య దేవాలయంగా విరాజిల్లనుందన్నారు. దేశం ఆర్థిక ప్రగతి సాధించాలని శ్రీవారిని ప్రార్థించానని ఎంపీ జీవీఎల్ తెలిపారు.

Related Posts