YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కారు తుడిచిన ప్రియాంకా

కారు తుడిచిన ప్రియాంకా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4, 
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన కారు అద్దాలు తుడిచారు. ఆ వీడియో చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకొని ఇక అదే పని చేయాల్సి వస్తుందంటూ ఓ ట్విటర్ యూజర్ ఘాటు విమర్శలు చేశాడు.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కారు తుడిచారు. రిపబ్లిక్ డే దినోత్సవం రోజున ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి రాంపూర్ వెళ్తూ.. మార్గమధ్యలో ప్రియాంక తన వాహనాన్ని ఆపించి కారు అద్దాలను క్లీన్ చేశారు. ఆ పరిణామానికి ఆమె అనుచరులు, వ్యక్తిగత సహాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాము క్లీన్ చేస్తామంటూ ప్రియాంక చేతిలో నుంచి గుడ్డను తీసుకోబోయారు. ఆమె ఒకింత అసహనంగా కారు అద్దాలను తుడిచేశారు. ముందున్న వాహనాలు సరిగా కనిపించడంలేదని డ్రైవర్ అనడంతో ప్రియాంక గాంధీ కారు దిగి స్వయంగా అద్దాలు తుడిచినట్లు తెలుస్తోంది. ఓ గుడ్డతో ఆమె కారు అద్దాలను క్లీన్ చేస్తున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. అక్కడే ఉన్న యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ కూడా కారు అద్దాలు తుడిచే ప్రయత్నం చేశారు. లక్నో, రాంపూర్ రహదారిపై గురువారం (ఫిబ్రవరి 4) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన అనంతరం ప్రియాంక గాంధీ.. రాంపూర్‌లోని డిబ్డిబా గ్రామం చేరుకున్నారు. గణతంత్ర దినోత్సవం నాటి ట్రాక్టర్ల ర్యాలీలో మరణించిన రైతు నవ్‌రీత్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అక్కడే జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతు నవ్‌రీత్ సింగ్ ప్రాణ త్యాగం వృథా కాదని అన్నారు. బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.ప్రియాంక గాంధీ కారు అద్దాలు తుడిచిన ఘటనపై కొంత మంది నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘నాటకాలు బాగా రక్తి కట్టిస్తున్నారు..’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఇక రాజకీయాలను వదిలేసి అదే పని చేయాల్సి వస్తుంది..’ అంటూ మరో నెటిజన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

Related Posts