YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎంగా ఈటెలకు పెరుగుతున్న మద్దతు

సీఎంగా ఈటెలకు పెరుగుతున్న మద్దతు

కరీంనగర్, ఫిబ్రవరి 5, 
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్ కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ విపక్ష నేతలు మాత్రం ఓ మంత్రి వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ కన్నా మంత్రి ఈటల రాజేందర్‌ చేస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడే కావొచ్చు.. కానీ ఆయన్ను సీఎం చేస్తే విమర్శలు వస్తాయని తెలిపారు. కేసీఆర్‌కు బదులు ఈటలను సీఎం చేస్తే ఎలాంటి విమర్శలు తలెత్తవని అన్నారు. కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ చట్టాలపై మాట్లాడిన ఈటలను అభినందిస్తున్నానని తెలిపారు. ఎంపీగా గెలిచిన 100 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న ధర్మపురి అర్వింద్ ఎక్కడున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.పసుపు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం జీవన్‌ రెడ్డి లేఖ రాశారు. క్వింటా పసుపు అమ్మితే గతంలో తులం బంగారం వచ్చేదని.. ఇప్పుడు ఆ తులం బంగారం రూ.50 వేలకు పెరిగిందని గుర్తు చేశారు. కానీ, పసుపు పంట మాత్రం క్వింటా రూ.6 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.పసుపు బోర్డు వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ మాత్రం చలనం లేకుండా పోయిందని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయొచ్చని సూచించారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారని మండిపడ్డారు

Related Posts