YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పెండింగ్ సమస్యలపై మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు

పెండింగ్ సమస్యలపై మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు

పెండింగ్ సమస్యలపై మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు
హన్మకొండ ఫిబ్రవరి 6
ఎంతో కాలంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్యల సాధనతో పాటు, పలు సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆయన క్యాంపు కార్యాలయం హన్మకొండలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రొమోషన్స్ సీఎం కెసిఆర్   ఆదేశాలతో దాదాపు అన్ని శాఖలలో ప్రొమోషన్స్ వచ్చిన సందర్బంగా మంత్రి కలిసి ఉద్యోగ సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ  ఫిట్మెంట్ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించాలని మంత్రిని కోరారు. జిల్లాకు చెందిన ఉద్యోగుల వివిధ సమస్యలను మంత్రికి వివరించారు. వాటిని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీజీవో, టీఎన్జీవో  ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్స్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు, కోలా రాజేష్ కుమార్, ట్రాసా జిల్లా అధ్యక్షులు . రాజకుమార్, రాష్ట్ర సహాధ్యక్షుడు రియాజుద్దీన్  ఉద్యోగ సంఘం  నాయకులు మాధవ రెడ్డి, సదానందం, మురళీధర్ రెడ్డి  తదితరులు ఉన్నారు.

Related Posts