YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మ‌న్మోహ‌న్ చెప్పారు.. నేను చేస్తున్నా.. ప్ర‌ధాని మోదీ

మ‌న్మోహ‌న్ చెప్పారు.. నేను చేస్తున్నా.. ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ ఫిబ్రవరి 8  
సోమ‌వారం రాజ్య‌స‌భ‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై వ‌య‌ వ‌సాయ చ‌ట్టాల‌పై చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. చాలాసేపు మాట్లాదారు. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను స‌మ‌ర్థించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిపక్షాల‌ను, ముఖ్యంగా  కాంగ్రెస్‌ను ఏకిపారేశారు. గ‌తంలో ప్ర‌తి ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగంలో సంస్క‌ర‌ణ‌ల గురించి మాట్లాడింద‌ని, ఆ త‌ర్వాత వివిధ పార్టీలు యూట‌ర్న్ తీసుకున్నాయ‌ని విమ‌ర్శించారు. ఈ సందర్బంగా మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తూ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసారు.రైతుల ఆందోళ‌న విష‌యంలో మీరు ప్ర‌భుత్వంపై దాడి చేయ‌డం బాగానే ఉంది కానీ.. అదే స‌మ‌యంలో అభివృద్ధి చెందాలంటే మార్పు త‌ప్ప‌నిస‌రి అని మీరు రైతుల‌తో కూడా చెప్పాలి అని ప్ర‌తిప‌క్షాల‌ను ఉద్దేశించి మోదీ అన్నారు. ఈ సంద్భంగా మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ గ‌తంలో చెప్పిన విష‌యాల‌ను మోదీ ప్ర‌స్తావించారు. ప్ర‌తిపక్షాలు నా మాట విన‌క‌పోయినా ఆయ‌న మాటైనా వింటారు క‌దా అని ఈ సంద‌ర్భంగా మోదీ అన్నారు. రైతుల‌కు ఓ స్వేచ్ఛాయుత మార్కెట్ అవ‌కాశం క‌ల్పించాల‌ని, ఇండియాను ఓ పెద్ద కామ‌న్ మార్కెట్‌గా చేయాల‌ని గ‌తంలో మ‌న్మోహ‌న్ అన్నార‌ని మోదీ వెల్ల‌డించారు. ఆ దిశ‌గా ఉన్న అడ్డంకుల‌నే ఇప్పుడు తాము తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఒక‌ర‌కంగా మీరు గ‌ర్వ‌ప‌డాలి. మ‌న్మోహ‌న్ సింగ్ చెప్పిన అంశాన్ని మోదీ చేస్తున్నార‌ని అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.

Related Posts