హైదరాబాద్ ఫిబ్రవరి 8
బడుగులు, బలహీన వర్గాల కోసం మేము పోరాడుతున్నాం. గిరిజనుల భూములు రక్షించేందుకు మావాళ్ళు వెళ్తే కబ్జా దారులకు కేసీఆర్ కొమ్ము కాస్తున్నాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. సోమవారం జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా పదాధికారుల పరిచయ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. సంజయ్ మాట్లాడుతూ
బీసీ భవన్ల పేరుతో సీఎం కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం బీసీ భవన్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీ ఇవ్వకుండా ఉపాధ్యాయులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సూర్యాపేట్ జిల్లా ఆదక్షుడు తో సహా చాలా మందిని పోలీసులు కిడ్నాప్ చేశారు. ఎవరిని ఎక్కడ పెట్టారో కూడా తెలియట్లేదు. మా వాళ్లకు ఏ హాని జరిగిన కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వస్తానని అన్నారు. భయపడే ప్రసక్తే లేదు. గిరిజన భూముల కోసం మేము వెళ్తే కబ్జాదారుల కోసం కేసీఆర్ పోలీసులతో లాఠీచార్జి చేయించిండు. మావాళ్లను బేషరతుగా వదిలేయాలి. మేము ఐపీఎస్ ఆఫీసర్లకు జరుగుతున్న అవమానం పై ప్రశ్నిస్తున్నాం. రిటైర్ అయిన ఆఫీసర్లకు ఎక్స్ టెన్షన్ ఇచ్చి అర్హులైన ఆఫీసర్లకు ద్రోహం చేస్తున్నారని అయన అన్నారు. పోలీసులకు, మాకు గొడవ కాదు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలి. బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఇతర నాయకుల్ని వెంటనే వదిలేయాలి. నాగార్జున సాగర్ లో గిరిజనులు ఖచ్చితంగా దీనిపై పగ తీర్చుకుంటారు. వచ్చే రెండేళ్లు ఓబీసీ మోర్చా పదాధికారులంతా కష్టపడాలని అన్నారు. పేదల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ అని అయన అన్నారు.