శ్రీకాకుళం ఫిబ్రవరి 08
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పంచాయతీ ఎన్నికల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. ఆదివారం ఆమదాలవలస మండలం తొగరాం గ్రామస్థులతో కలిసి శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దర్కు ఫిర్యాదుచేశారు. తొగరాం పంచాయతీలో స్పీకర్ తమ్మినేని వాణిశ్రీని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దించుతున్నారని చెప్పారు. సర్పంచ్గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న తమ్మినేని శ్యామలరావు, తమ్మినేని అమర్నాథ్ కుటుంబసభ్యులపై స్పీకర్, అతని అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.