YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

అధికారులకు అభినందించిన మంత్రి కాలవ

అధికారులకు అభినందించిన మంత్రి కాలవ
రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలంలో జరిగిన "మీకోసం ఫిర్యాదుల దినోత్సవం" లో మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ రోజు జిల్లాకు మంచి రోజు..అత్యంత మారుమూల ప్రాంతమైన కనేకల్ కు తరలివచ్చి ప్రజల నుండి సమస్యలను స్వీకరిస్తున్న అధికారులను అభినందిస్తున్నానని అన్నారు. ఈ స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం జరగడం చరిత్రలో మొదటి సారి. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం గ్రౌండింగ్ చేసి, ఓడిఎఫ్ గా ప్రకటించుకోవడం సంతోషమని అన్నారు. 5,58,286 ఇళ్లకు గాను, వాటిలో 1,42,132 ఇల్లు మరుగుదొడ్లు కలిగి ఉన్నాయి. మిగిలిన 4,16,154 ఇళ్లకు మరుగుదొడ్లను  నిర్మించుకున్నామని అన్నారు. నిర్మించిన మరుగుదొడ్లను వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలని జిల్లా అధికారులను మంత్రి కోరారు. ప్రతి అధికారి కష్టపడి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి అధికార గణాన్ని అభినందించారు. 

Related Posts