YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అడ్డూ, అదుపు లేకుండా సైబర్ నేరాలు

అడ్డూ, అదుపు లేకుండా సైబర్ నేరాలు

అడ్డూ, అదుపు లేకుండా సైబర్ నేరాలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 9,
బర్ నేరస్థులు రోజుకో ఎత్తుతో అమాయకుల ను నమ్మిస్తు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కా జేస్తున్నారు. ఇలాంటి కేసులు సైబరాబాద్ పోలీ స్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్యాంక్ అధికారులు తమ ఖాతాదారుల కు ఫోన్ చేసి ఎలాంటి వివరాలు అడుగరని చెబుతున్నా కూడా ఖాతాదారుల్లో మార్పు రావడంలే దు. పేటిఎం తదితర వాటికి కేవైసి అప్‌డేట్ చేయకపోతే ఆగిపోతుందని బెదిరించడంతో చాలామ ంది బ్యాంక్ ఖాతాదారులు సైబర్ నేరస్థులు అ డిగి వివరాలు చెబుతున్నారు. బాధితులు చెప్పిన వివరాలతో సైబర్ నేరస్థులు వారి ఖాతాల్లోని డబ్బులను కొల్లగొడుతున్నారు.సైబర్ నేరస్థులు పేటిఎం వాడుతున్న వారిని టా ర్గెట్ చేసుకుని వారికి కేవైసి అప్‌డేట్ చేసుకోవాలని మెసేజ్‌లు పంపిస్తున్నారు. వాటికి స్పందించిన వారికి ఫోన్ చేసి కేవైసి వివరాలు తాము చెప్పిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు. దానిని నమ్మి డౌన్‌లోడ్ చేసుకున్న వా రికి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలా ఎనీ డెస్క్ యాప్, క్విక్ సపోర్టు యాప్, టీమ్ వ్యూవర్ యాప్‌ల ద్వారా సైబర్ నే రస్థులు దోచుకుంటున్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రూ.100 మాత్రమే పంపివ్వమని చెప్పడంతో బాధితులు సులభంగా నమ్ముతున్నారు.సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూ కట్‌పల్లికి చెందిన రవిశంకర్ జనవరి23వ తేదీ, 2020న తన మొబైల్ ఫోన్‌కు 8308969378 నంబర్ నుంచి కేవైసి అప్‌డేట్ చేసుకోవాలని మెసేజ్ వచ్చింది. తర్వాత ఫోన్ చేసి పిటిఎం వివరాలు చెప్పాలని, కేవైసి అప్‌డేట్ చేసుకోవాలని చెప్పాడు. దానిని నమ్మిన సైబర్ నేరస్థుడు చెప్పినట్లు ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రూ. 100 పంపించాడు. ట్రాన్‌జాక్షన్ ఫేయిల్ అని రావడంతో వచ్చింది, సైబర్ నేరస్థులు పేటిఎం ఖాతాను హ్యాక్ చేయడంతో అలా వచ్చింది. కొద్ది సేపటి తర్వాత బ్యాంక్ ఖాతా నుంచి రూ.62, 542 పేటిఎం ద్వారా విత్‌డ్రా చేసుకున్నట్లు మె సేజ్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి 19 ట్రాన్‌జాక్షన్స్ ద్వారా తీసుకున్నట్లు మె సేజ్ వ చ్చింది. సైబర్ నేరస్థుడి ఫోన్ ఆఫ్ అని వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పేటిఎం కేవైసిని అప్‌డేట్ చేసుకోవాలని క్విక్ యాప్‌తో డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు పొందుపర్చాలని చెప్పడంతో సంఘారెడ్డి జిల్లా, రామచంద్రాపురం, వినాయకనగర్‌కు చెందిన ఫక్రుద్దిన్ మహ్మద్ గత నెల 23వ తేదీన సైబర్ నేరస్థులు ఫోన్ చేసి బాధితుడిని వివరాలు పొందుపర్చాలని, తర్వాత రూ.1 పంపించాలని తెలిపారు. ఇది నమ్మిన బాధితుడు సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేశాడు. ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బిఐ ద్వారా నుంచి ఐదు ట్రాన్‌జాక్షన్ల ద్వారా రూ.78,399 విత్‌డ్రా చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts